తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. రేపు రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు కూడా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ చిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా కేంద్రం ఈ ప్రత్యేక నాణేన్ని తయారు చేసింది. ఈ నాణెం ఆవిష్కరణలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబు బాబుకు రాష్ట్రపతి భవన్ వర్గాలు ఆహ్వానం పంపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa