ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేపల కోసం వల విసిరితే పురాతన విగ్రహాలు దొరికాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 06:23 PM

శ్రీకాకుళం జిల్లాలో నదిలో పురాతన దేవతల విగ్రహాలు బయటపడ్డాయి. హిరమండలం గొట్టాబ్యారేజీ దిగువున ఉన్న వంశధార నదిలో.. భగీరధపురంకి చెందిన పూలసరి శంకరరావు అనే మత్స్యకారుడు చేపల కోసం వల విసిరాడు. అతడి వలకు ఏదో బరువుగా తగిలింది.. వెంటనే అతి కష్టం మీద వలను పైకి లాగి చూశాడు. వలలో చేపలు మాత్రం కనిపించలేదు.. లక్ష్మి దేవి, గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలు దొరికాయి. ఏం చేయాలో తెలియక వటిని తిరిగి నదిలో పడేశాడు. చేపల వేట పూర్తయ్యాక ఇంటికి వెళ్లిపోయాడు.


శంకరరావు నదిలో విగ్రహాలు దొరికిన విషయాన్ని స్థానికులకు చెప్పగా.. ఆ విగ్రహాలను మళ్లీ బయటకు తీద్దామని చెప్పారు. దీంతో శంకరావు స్థానికులు, మిగిలిన మత్స్యకారులతో కలిసి తిరిగి నదిలో విగ్రహాల కోసం వెతకగా.. లక్ష్మీ దేవి, గణపతి విగ్రహాలు మాత్రమే దొరికాయి. హనుమంతుడి విగ్రహం కోసం వెతికినా లభ్యం కాలేదు. అలా దొరికిన లక్ష్మీ దేవి, గణపతి విగ్రహాలను స్థానికంగా ఉన్న గొట్ట పోలమ్మ ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు స్థానికులు.


ఇలా నదిలో విగ్రహాలు దొరికాయని తెలియడంతో ఆ చుట్టు పక్కల గ్రామాల్లో చర్చ జరుగుతోంది. ఈ విగ్రహాలను చూసి పూజలు చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు పోలమ్మ ఆలయానికి వస్తున్నారు. నదిలో విగ్రహాలు దొరకటం భగవంతుడి మహిమ అంటున్నారు స్థానికులు. నదిలో దొరికిన విగ్రహాలు ఏ కాలం నాటివి.. ఏ లోహంతో తయారు చేశారన్నది తెలియాల్సి ఉంది. ఈ విగ్రహాలను తీసుకొచ్చి నదిలో నిమజ్జనం చేశారు.. భూమిలో నుంచి బయటపడ్డాయా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa