విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా అమ్మవారికి చీరలు, రవికలు సమర్పిస్తుంటారు.. వీటిని ఆలయ ప్రాంగణంలో ఉండే షాపుల్లోనే కొనుగోలు చేస్తుంటారు భక్తులు. ఈ క్రమంలోనే ఇంద్రకీలాద్రిపై రవికల పేరుతో మోసం చేస్తున్నారని హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ భక్తురాలు ఆరోపిస్తున్నారు. రవికల పేరిట గుడ్డ పీలికలను అంటగడుతున్నారని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ నుంచి ఎం హారిక దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చారు. అమ్మవారికి రవికను సమర్పించేందుకు మహా మండపం ఐదో అంతస్తులోని షాపునకు వెళ్లి రూ. వంద చెల్లించి రవికను కొనుగోలు చేశారు. అలాగే రూ. 10 చెల్లించి పసుపు, కుంకుమ ప్యాకెట్ను కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దేవస్థాన కౌంటర్లో ఆ రవికను సమర్పించారు. అయితే దేవస్థాన కౌంటర్లోని సిబ్బంది అది చెత్తలో వేయాలని చెప్పడంతో షాకయ్యాను అన్నారు హారిక.
అనుమానంతో తమకు విక్రయించినది రవిక ముక్కను పరిశీలించినట్లు చెప్పారు. కానీ తమకు విక్రయించింది రవిక కాదని.. కనీసం ఖర్చీపు కూడా కాదన్నారు. అయితే అమ్మవారి రవికల పేరిట గుడ్డ పీలికలను అందమైన ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారని ఆమె ఆరోపించారు. అడిగినంత ఇస్తున్నా.. ఆలయ ప్రాంగణంలోనే ఇలా భక్తులను మోసం చేయడం సరికాదని.. కౌంటర్లో సిబ్బందిని ప్రశ్నించానన్నారు. దీనిపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయాలని వారికి సూచించినట్లు తెలిపారు.
హారిక ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాని.. కానీ ఆలయ ప్రాంగణంలో ఇదంతా సాధారణమని ఆ అధికారి సలహా ఇచ్చారని.. అందుకే ఆలయ ఈవో భ్రమరాంబను కలిసేందుకు ప్రయత్నించామన్నారు. ఆ సమయంలో ఈవో అందుబాటులో లేరని వెనక్కు వచ్చేశామన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు ప్రతి రోజూ వస్తారని.. ఇలా భక్తులను మోసం చేస్తున్న వ్యాపారులపై ఆలయ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa