ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2023, 02:19 PM

వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంటుందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌తో ఈ విషయంపై కేంద్ర పెద్దలు చర్చించారన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన సమర్ధిస్తుందని చెప్పారు. పార్లమెంట్‌లో కూడా జమిలీ ఎన్నికలపై చర్చ జరిగి, దీనిపై నిర్ణయం జరగాల్సి ఉందన్నారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక కావడం వల్ల దేశానికి కూడా మంచి జరుగుతుందని చెప్పారు. జమిలీ ఎన్నికలపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుందన్నారు. కేంద్రంలో ఉన్న నాయకత్వం ఈ అంశాంన్ని బలంగా ముందుకు తీసుకెళ్తుందని.. ఇది మంచి నిర్ణయం.. కాబట్టి మార్పులు చేస్తారని భావిస్తున్నామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల ద్వారా ఏపీలో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa