జూన్ 2 వ తేదీన ఒడిశాలోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ రైలు ప్రమాద ఘటనపై విచారణ జరిపిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ తాజాగా ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఇప్పటికే ఈ ఘటనలో ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసి విచారణ జరిపిన సీబీఐ వారిపై ఈ ఛార్జ్షీట్లో నేరాభియోగాలు మోపింది. రైల్వే చట్టంలోని 153 సెక్షన్తోపాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించడం, హత్యతో సమానమైన అభియోగాలను వారిపై నమోదు చేసింది. రైలు ప్రమాద ఘటనలో కుట్ర కోణం దాగి ఉందన్న అనుమానాలతో విచారణ జరిపేందుకు రంగంలోకి దిగిన సీబీఐ.. జులై 7న సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ అమీర్ ఖాన్, టెక్నిషియన్ పప్పు కుమార్లను అరెస్టు చేసింది.
ప్రమాదం జరిగిన బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో 94 వ లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద మరమ్మతు పనులు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంత సమక్షంలోనే జరిగాయని సీబీఐ వెల్లడించింది. అయితే ఈ పనులకు 79 వ లెవెల్ క్రాసింగ్ గేట్కు సంబంధించిన సర్క్యూట్ రేఖా చిత్రాన్నే ఉపయోగించారని తెలిపింది. ఇప్పటికే ఉన్న సిగ్నల్, ఇంటర్ లాకింగ్ వ్యవస్థలను పరీక్షించడం, మరమ్మతులు చేపట్టడం, మార్పులు చేయడమనేది.. ఆమోదిత ప్రణాళిక, సూచనలకు అనుగుణంగా ఉన్నాయనేది నిర్ధారించుకోవడం అరుణ్ కుమార్ మహంత పని అని.. అయితే ఆయన దాన్ని పట్టించుకోలేదని అని తెలిపింది. ఇటీవల అరుణ్ కుమార్ మహంత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంలోనూ సీబీఐ ఇదే తరహా వాదనలు చేయడంతో కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది.
జూన్ 2 వ తేదీన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ వద్ద.. జరిగిన ప్రమాదంలో 296 మంది మృత్యువాత పడ్డారు. మరో 1200 మందికిపైగా గాయపడగా.. వందల మంది వికలాంగులుగా మారారు. లూప్లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మొదట షాలీమార్ - చెన్నై కోరమాండల్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొంది. దీంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్లోని కొన్ని బోగీలు ఎగిరి.. పక్కన ఉన్న ట్రాక్పై పడ్డాయి. అయితే అప్పుడే ఆ ట్రాక్పై దూసుకెళ్తున్న బెంగళూరు - హౌరా సూపర్ఫాస్ట్ రైలు ఆ బోగీలను ఢీకొట్టండో దాని బోగీలు పట్టాలు తప్పాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో పెను విషాదం చోటుచేసుకుంది. అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే ఈ ఘటనకు దారితీసిందని సీబీఐ ఇప్పటికే వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa