భారత్ ఆతిథ్యం ఇస్తున్న జీ 20 సదస్సుకు జీ 20 దేశాల అధినేతలతోపాటు చాలా దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చేరుకోనున్న విదేశీ ప్రతినిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఆ విదేశీ ప్రతినిధులు ఢిల్లీలో ఎక్కడికైనా వెళ్లినపుడు వారు షాపింగ్ కానీ ఇతర చెల్లింపులు చేసేందుకు వీలుగా వారి అకౌంట్లలో రూ. 1000 వేయాలని నిర్ణయించింది. దీంతో వారు యూపీఐ వ్యాలెట్ల నుంచి సులభంగా షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే యూపీఐ పేమెంట్స్ పెంచి భారత్ డిజిటల్ చెల్లింపుల గురించి విదేశాలకు కూడా అవగాహన కల్పించాలని యోచిస్తోంది.
విదేశీ ప్రతినిధలు బయటకు వెళ్లినపుడు వారు ఎక్కడైనా యూపీఐ పేమెంట్స్ చేసేలా వారి యూపీఐ వాలెట్లో రూ.1000 జమ చేయనుంది. యూపీఐ చెల్లింపుల ద్వారా భారత్లో నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో దేశంలో 10 బిలియన్లకు యూపీఐ పేమెంట్స్ జరిగాయి. ఈ క్రమంలోనే ఈ డిజిటల్ చెల్లింపులను ప్రపంచ సాధనంగా మార్చాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దానికి జీ20 సదస్సు ద్వారా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది. అందుకే దాదాపు 1000 మంది విదేశీ ప్రతినిధులకు తొలిసారి యూపీఐ పేమెంట్స్ చేసేలా ప్రోత్సహిస్తోంది.
విదేశీ ప్రతినిధులు యూపీఐ పేమెంట్స్ను భారత్లో వినియోగించేందుకు వారి యూపీఐ వ్యాలెట్లలో రూ. 500 నుంచి రూ. 1000 వరకు డబ్బులను డిపాజిట్ చేయనుంది. దీంతో వారు తమ ఫోన్ల నుంచి యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. యూపీఐ పేమెంట్స్ను ప్రోత్సహించేందుకు ఈ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలను కేటాయించింది. యూపీఐని భారత్ స్వయంగా అభివృద్ధి చేయగా.. చిల్లర చెల్లింపుల విషయంలో ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలోనే భారత్లో సక్సెస్ అయిన ఈ యూపీఐ పేమెంట్స్ను ఇతర దేశాల్లో కూడా విదేశాల్లో కూడా చేరుకుంటుంది. యూపీఐ పేమెంట్స్ కోసం శ్రీలంక, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ దేశాలు భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా దేశాలు ఈ యూపీఐ పేమెంట్స్ను ఉపయోగించుకునేందుకు చాలా ఆసక్తిని చూపిస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాది మొదట్లో విదేశాల నుంచి భారత్కు వచ్చే పర్యాటకులకు యూపీఐ చెల్లింపునకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. వారు భారత్ ప్రయాణించే సమయంలో యూపీఐ చెల్లింపులు చేయవచ్చని తెలిపింది.
భారత్లో జరిగిన డిజిటల్ విప్లవాన్ని కూడా జీ 20 సదస్సులో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించనుంది. కేవలం యూపీఐ మాత్రమే కాకుండా ఆయా దేశాల ప్రతినిధులకు ఆధార్ కార్డులు, డిజిలాకర్ సేవలను తెలియజేయనున్నారు. మరోవైపు.. జీ 20 సదస్సు కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన భాషిణి, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ఈ-సంజీవనిలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భాషిణి అనేది రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్, ఇది విదేశీ ప్రతినిధుల అన్ని ప్రోగ్రామ్లను వారి స్వంత భాషలో వినడానికి సహాయపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa