ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సనాతన ధర్మం హెచ్ఐ‌వీ లాంటిది.. మరో డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 08:41 PM

సనాతన ధర్మం గురించి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో మరో డీఎంకే నేత అడుగు ముందుకేసి సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవీతో పోల్చారు. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీతో పోల్చిన డీఎంకే ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా... ఇదో సామాజిక రుగ్మత అని విమర్శించారు. ఉదయనిధి స్టాలిన్ మలేరియా, డెంగీతో పోల్చితే.. ఈయన ఏకంగా హెచ్ఐవీతో పోల్చడం గమనార్హం. అంతేకాదు, సనాతన ధర్మంపై చర్చకు అనుమతిస్తే.. సమాధానాలు ఇవ్వడానికి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.


‘ప్రధానమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను అనుమతిస్తే, క్యాబినెట్ మంత్రులందరికీ సమాధానాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నిర్ణయించిన తర్వాత 'సనాతన ధర్మం' ఏది అని నేను వివరిస్తాను.’ అని రాజా అన్నారు. పుదుచ్చేరిలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాజ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. దీనిపై అమిత్ షా లేదా ఇతర బీజేపీ ముఖ్య నేతలు ఎవరైనా తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.


సనాతన ధర్మం ప్రజల మధ్య అసమానతలను ప్రోత్సహించిందని, మహిళల హక్కులను అరికట్టిందని అన్నారు. భర్త మరణిస్తే అతడి చితిపై కూర్చుని భార్య ప్రాణత్యాగం చేసే సతీసహగమనాన్ని సమర్దించిందని అన్నారు. ‘అటువంటి పద్ధతులను పునరుద్ధరించాలనుకుంటున్నారా? మనం అన్ని అసమానతలతో పోరాడాం.. ఈ సనాతన ధర్మాన్ని అంగీకరిస్తే.. మనం పెరియార్ (ద్రవిడ కజగం వ్యవస్థాపకుడు ఈవీ రామసామి), అన్నా (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై), కలైంజ్ఞర్ (కరుణానిధి) సూచించిన సూత్రాలకు వ్యతిరేకం. ఈ ధర్మాన్ని అంగీకరించడం వల్ల తోటి మానవులకు మనల్ని శత్రువులుగా మారుస్తారు, నేను ఈ ధర్మాన్ని అంగీకరిస్తే నేను మనిషిని కాదు’ అని రాజా ఉద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa