సాధారణంగా అందరూ రాత్రి పూట నిద్రపోతూ ఉంటారు. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉండగానే అక్కడ ఉన్న ప్రజలకు గుండె గుభేల్మనే వార్త వినిపించింది. మరికాసేపట్లో సునామీ వస్తుందని సైరన్ మోగింది. అయితే 20 నిమిషాల పాటు ఆ సైరన్ మోగడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నిద్రలో ఉన్న వారు ఉలిక్కి పడి లేచి అటూ ఇటూ పరిగెత్తారు. చివరికి అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలు పోయినంత పనైందని తర్వాత వారు ఆ భయం నుంచి తేరుకుని చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే.
మరి కాసేపట్లో గోవాలో సునామీ రానున్నట్లు అందిన తప్పుడు సమాచారంతో అక్కడ ఉన్న వారందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 20 నిమిషాల పాటు సునామీ సైరన్ మోగడంతో గోవా వాసులంతా ఏం జరుగుతుందో తెలియక అర్ధరాత్రి బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడిపారు. ఉత్తర గోవా జిల్లాలోని పోర్వోరిమ్ ప్రాంతంలో ఉన్న కొండపై ముందస్తు హెచ్చరికల వ్యాప్తి వ్యవస్థ - ఈడబ్ల్యూడీఎస్ను ఇటీవల ఏర్పాటు చేశారు. అయితే ఇది సునామీ రావడానికి ముందు రాబోయే విపత్తును గుర్తించి.. సైరన్ ద్వారా సునామీ వస్తుందన్న హెచ్చరికలు చేస్తుంది.
అయితే బుధవారం రాత్రి ఈ సైరన్ మోగింది. దీంతో కాసేపట్లో సునామీ వస్తుందన్న వార్తలు, వాదనలు, హెచ్చరికలు వినిపించాయి. ఈ సైరన్ విన్న గోవా వాసులతోపాటు అక్కడ పర్యాటకం కోసం వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు ఒక్కసారిగా వణికి పోయారు. తీవ్ర భయాందోళనలకు గురై ఎక్కడికక్కడ పరుగులు తీశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ సునామీ సైరన్ మోగుతూనే ఉండటంతో స్థానికుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. అయితే అది అలాగే మోగడంతో సైరన్ వ్యవస్థ తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ప్రజలు గ్రహించారు. దీంతో సునామీ ముప్పు పొంచి ఉండే ప్రమాదం లేదని గుర్తించారు. దీంతో అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మము హేగే స్పందించారు. సైరన్ మోగుతున్నట్లు తమకు సమాచారం వచ్చిన వెంటనే దానిపై సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. భారత వాతావరణ శాఖ నుంచి ఎలాంటి హెచ్చరికలు రాలేదని.. దీంతో టెక్నికల్ సమస్య కారణంగానే సైరన్ మోగినట్లు గుర్తించామని ఆమె తెలిపారు. అయితే దీనిపై విచారణ చేపట్టినట్లు వివరించారు. ఇలా అకస్మాత్తుగా సైరన్ మోగడానికి గల కారణాలకు సంబంధించి సరైన వివరణ ఇవ్వాలని గోవా రాష్ట్ర జలవనరుల శాఖకు కలెక్టర్ ఆదేశించారు.
ఈ ఘటనపై గోవా వాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు సైరన్ మోగిందని.. దీంతో బాగా భయపడి ఆందోళనకు గురైనట్లు చెప్పారు. చాలాసేపు ఆ సునామీ సైరన్ మోగుతుండడంతో తమకు అనుమానం వచ్చిందని తెలిపారు. సముద్రం నుంచి ఎలాంటి అలజడి లేదని.. సైరన్ తప్పుడు హెచ్చరిక జారీ చేస్తోందని గుర్తించి ఊపిరి పీల్చుకున్నామని స్థానికులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa