నేడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం విశాఖపట్నంనగరానికి వస్తున్నారు. ఆయన మధ్యాహ్నం 3.05 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 4.10 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి పోర్టు అతిఽథి గృహా నికి చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. శనివారం ఉదయం నోవాటెల్ హోటల్లో జరగనున్న సమాచార హక్కు కమిషనర్ల జాతీయ సదస్సుకు హాజరవుతారు. అదేరోజు మధ్యాహ్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్స వానికి హాజరై పట్టభద్రులకు పట్టాలు ప్రదానం చేస్తారు. అనంతరం పోర్టు గెస్ట్హౌస్కు చేరుకుని రాత్రి బస చేస్తారు. ఈనెల పదో తేదీన ఎయిర్పోర్టుకు వెళ్లి...అక్కడ నుంచి హెలికాప్టర్లో అరకులోయ వెళతారు. అదేరోజు సాయంత్రం తిరిగి నగరానికి చేరుకుంటారు. ఈనెల 11వ తేదీ సాయంత్రం తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రాన్ని సంద ర్శిస్తారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరిగి పోర్టు అతిథి గృహానికి చేరుకుంటారు. ఈనెల 12వ తేదీన రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్లో జరగనున్న జాతీయ జైలు విభాగాధిపతుల సదస్సులో పాల్గొంటారు. అనంతరం పోర్టు గెస్టుహౌస్కు చేరుకుని...కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ఎయిర్పోర్టుకు వెళ్లి గన్నవరం బయలుదేరి వెళతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa