ప్రకాశం జిల్లాలో ఘరానా మోసం జరిగింది. యర్రగొండపాలెంలో లుంగీలు కొనేందుకు బట్టల షాపుకు కష్టమర్లా వచ్చిన వ్యక్తి యజమాని ఫోన్ పేలో డబ్బుల్ని నొక్కేశాడు. పట్టణంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర బట్టల దుకాణానికి ఓ వ్యక్తి వచ్చాడు.. షాపు యజమాని కోటేశ్వరరావు బిజీగా ఉన్నట్టు గుర్తించాడు. లుంగీలు కొని డబ్బులు ఫోన్ పే ద్వారా చెల్లిస్తానని షాపు యజమానికి చెప్పాడు.. ఆయన కూడా సరే అన్నాడు. ఆ తర్వాత డబ్బులు పంపించినట్లు నటించి.. డబ్బులు వచ్చాయి చూసుకోండని యజమానికి చెప్పాడు.
కోటేశ్వరరావు వెంటనే తన ఫోన్ పే చూసుకుని డబ్బులు రాలేదని చెప్పటంతో.. తాను చూస్తాను అని అతడి దగ్గర నుంచి మొబైల్ తీసుకున్న దుండగుడు చూస్తున్నట్లుగా నటిస్తూ.. తన అకౌంట్లోకి రూ.98 వేలను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఆ వెంటనే మొబైల్ను షాపు యజమానికి తిరిగి ఇచ్చేశాడు.. తర్వాత అతడు అక్కడ నుంచి మెల్లిగా జారుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత తన అకౌంట్లో రూ.98వేలు మాయం కావడంతో కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
షాపు యజమాని డబ్బులు వచ్చాయా లేదా అని చెక్ చేసుసుకునే సమయంలో ఫోన్ పే పాస్ కోడ్ను నిందితుడు గమనించాడు. ఆ తర్వాత తన అకౌంట్కు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. వెంటనే పోలీసులు దుండగుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. ఆ షాపు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. అలాగే డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసకున్న అకౌంట్ వివరాలతో నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ మోసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa