టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తర్వాత పార్టీ నేతలు వరుసగా సమావేశం అవుతున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరిలో ఉన్ని టీడీపీ కేంద్ర కార్యాలయానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ సీనియర్లతో చర్చించారు. భవిష్యత్తు ప్రణాళికపై వారితో చర్చించారు. మంగళవారం ఉమ్మడి జిల్లాల్లోని నేతలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు, పార్టీ నేతల టార్గెట్గా ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలిపై ఆందోళనలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. పార్లమెంటు, నియోజకవర్గ స్థాయిల్లో కూడా కార్యక్రమాలకు సిద్ధం కావాలని నేతలకు సూచించారు. ఈ సమావేశానికి యనమల రామకృష్ణుడు సహా సీనియర్ నేతలు హాజరు అయ్యారు.
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో బాలకృష్ణ మీడియా రూమ్లోకి వచ్చి సీనియర్ నేత యనమల ఇతర నేతలతో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్ట్కు ఏపీ అంతటా టీడీపీ నేతలు ఆందోళనలు చేయగా.. దీనిపై కూడా చర్చించారు. బాలయ్య పార్టీ నేతలను పలకరించి రాష్ట్రంలో ఈరోజు చేపట్టిన బంద్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పార్టీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ మహిళా నేతల్ని పలకరించి ధైర్యం చెప్పారు. బాలకృష్ణ నిర్వహించిన ఈ సమావేశానికి సీనియర్లు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్రావులతో పాటు పట్టాభి, నక్కా ఆనంద్బాబు సహ పలువురు హాజరయ్యారు. పార్టీ పరిస్థితిపై పార్టీ సీనియర్ నేతలతో బాలయ్య ప్రధానంగా చర్చలు నిర్వహించారు. పార్టీ వ్యవహారాలపైనా ఆరా తీశారు. నారా లోకేష్ రాజమహేంద్రవరంలో ఉండటంతో బాలయ్య పార్టీ నేతల్ని కలిసి భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టారు. ఆయన పార్టీ నేతలకు అందబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa