బాపట్ల జిల్లాలో ఓ ష్కూల్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న సమయంలోనూ బస్సులోని స్కూల్ విద్యార్థుల్ని ప్రమాదం నుంచి తప్పించారు. చివరి క్షణాల్లోనూ చాకచక్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదం నుంచి అందర్నీ బయటపడేశారు. అద్దంకి మండలం ఉప్పలపాడు దగ్గర ఈ ఘటనజరిగింది. అద్దంకికి ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ ఏడుకొండలు.. మైలవరం, ఉప్పలపాడు, వెంపరాల గ్రామాల నుంచి 40 మంది విద్యార్థులతో పాఠశాలకు వస్తున్నాడు.
ఈ క్రమంలో ఉప్పలపాడు దాటిన తర్వాత డ్రైవర్ గుండెపోటు వచ్చింది. అతడు బస్సును పక్కకు పెట్టి సీటులోనే కుప్పకూలాడు. ఆ సమయంలో బస్సు రోడ్డు మధ్యలో ఆగింది. స్థానికులు గమనించి డ్రైవర్ను కిందికి దించి పరిశీలించగా అప్పటికే చనిపోయాడు. అధికారులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్ సహాయంతో అద్దంకికి చేర్చారు.
డ్రైవర్ గుండెపోటు వచ్చిన చాకచక్యంగా వ్యవహరించాడు. బస్సు పక్కకు పెట్టి కుప్ప కూలిపోయాడు.. దీంతో విద్యార్థులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడరు. ఈ ఘటన జరిగిన సమయంలో స్కూల్ బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. తన ప్రాణాలు పోతున్నా సరే బస్సును కంట్రోల్ చేసి విద్యార్థుల్ని ప్రమాదం నుంచి కాపాడిని ఏడుకొండల్ని అందరూ ప్రశంసిస్తున్నారు. స్కూలు యాజామాన్యం.. అధికారులు ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa