ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కిల్ కేసుపై ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్,,,,నాట్ బీఫోర్ మీ అన్న హైకోర్టు న్యాయమూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2023, 07:06 PM

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టైన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిల్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని హైకోర్టు జస్టిస్ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్ రఘునందన్‌రావుల ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. ఓ న్యాయమూర్తి నాట్ బీఫోర్ మీ అనడంతో వేరే బెంచ్‌కు బదిలీ చేయనున్నారు. ఏ బెంచ్ విచారించాలనేది హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయించనున్నారు. ఈ నెల 22న ఏపీ హైకోర్టులో స్కిల్ డెవలెప్‌మెంట్ కేసుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. ఈ కేసును సీఐడీతో కాకుండా సీబీఐతో విచారణ చేయాలని కోరారు. ఇవాళ ఈ పిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణకు రాగా.. న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అన్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని ఉండవల్లి పిల్‌లో కోరారు. ఈ స్కిల్ కేసులో ఉన్న సంక్లిష్టతతో పాటుగా హై ప్రొఫైల్ వ్యక్తులపై అభియోగాలు ఉన్న దృష్ట్యా.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ప్రధానంగా కోరారు. తన పిల్‌లో మొత్తం 44 మందిని ప్రతివాదులుగా చేర్చారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో పాటు సీబీఐ, ఈడీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు అరుణ్ కుమార్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa