ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా సమస్యలు పరిష్కరించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 02:40 PM

తన అసెంబ్లీ పరిధిలోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్‌కు రూ.5 కోట్లు, ముస్లిం షాదీ మంజిల్‌కు మరో రూ.5 కోట్లు విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యేగా కోరుతున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీడీపీ హయాంలో ముస్లిం, దళితులు, గిరిజనుల పిల్లల కోసం గురుకుల పాఠశాలలో 95 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 5 శాతం పనులు ఈ ప్రభుత్వ హయాంలో పూర్తికాలేదని... పిల్లలు ఆటో నగర్‌‌లో పొల్యూషన్ మధ్య చదువుతున్నారని వెల్లడించారు. ఆమంచర్ల సెజ్ కోసం 500 ఎకరాల పారిశ్రామిక వాడ కట్టాలని టీడీపీ హయాంలో 52 కోట్ల రూపాయలు రైతులకు పరిహారం కూడా ఇచ్చారన్నారు. 10 వేల మందికి ఉపాధి వచ్చే ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటుపై సాంకేతికంగా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని...అయితే దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారన్నారు. ఆయన సంతాప సభలో ఈ విషయాన్ని సీఎం ఎదుట చెప్పానని... ఇంకా పని మొదలు కాలేదన్నారు. తాను అధికార పార్టీలో నుంచి బయటకి వచ్చానని.. ప్రజల సమస్యలను గాలికి వదిలేయలేదని.... వైసీపీ నేతలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa