ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి పుస్తకాన్ని విడుదల చేసిన టీడీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 02:42 PM

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వాస్తవాలు పేరుతో టీడీపీ పుస్తకాన్ని రూపొందించింది. టీడీపీ రూపొందించిన పుస్తకాన్ని ఆ పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ.. ఆధారాల్లేకుండా స్కిల్ కేసు వేశారన్నారు. సంబంధం లేకున్నా ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లోనూ కేసులు పెట్టారని మండిపడ్డారు. నాటి ప్రభుత్వంలో తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల ప్రజలకు చాలా మేలు జరిగిందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీస్తున్నందుకే చంద్రబాబును జుడిషియల్ కస్టడీలో పెట్టారన్నారు. జగన్ ప్రభుత్వం పంచభూతాలను దోచుకుంటోందని.. ఆ దోపిడీని ప్రశ్నిస్తే బాబును జుడిషియల్ కస్టడీలో పెట్టారని విమర్శించారు. మద్యం, భూములు, ఇసుక వంటి వాటిల్లో ప్రభుత్వ అడ్డగోలు దోపిడీని ప్రశ్నించారని చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. ఇరిగేషన్ రంగాన్ని జగన్ నాశనం చేశారని చంద్రబాబు ప్రజల్లో చైతన్యం కలిగించడంతో జగన్‌లో  భయం మొదలైందన్నారు. స్కిల్ కేసులో ఆధారాలేవి అని నిలదీశారు. స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాల్లేవని నెల రోజుల తర్వాత ఏఏజీ చావు కబురు చల్లగా చెప్పారని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి అంటూ కేసులు పెట్టారన్నారు. రింగ్ రోడ్డు లేదు.. బొంగు రోడ్ లేదని.. ఐఆర్ఆర్ కేసులో లోకేష్ ఉన్నారని గతంలో ప్రకటనలు చేశారన్నారు. ముందస్తు బెయిల్ కోసం లోకేష్ కోర్టుకెళ్తే.. ఆయనకేం సంబంధం లేదని ప్రభుత్వమే చెప్పిందని తెలిపారు. ఎలాంటి ఆధారాల్లేకుండా నెల రోజుల పాటు చంద్రబాబును జైల్లో పెట్టారని మండిపడ్డారు. గతంలో తమకు 160 స్థానాలు వస్తాయనుకునేవాళ్లమని.. కానీ ఇప్పుడు జగన్ చేసిన తప్పులతో టీడీపీకి 175 స్థానాలు రావడం ఖాయమని క్లారిటీ వచ్చిందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa