ఈనెల 4న తల్లిని చంపడానికి ప్రయత్నించినా కొడుకు బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళ్ళితే.... కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి గ్రామానికి చెందిన నిల్ల పెద్దపుష్ప అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమె కుమారుడు గోపాల్ తుని తీసుకొచ్చాడు. చికిత్స అనంతరం బెండపూడి మోటార్ సైకిల్పై పయనమయ్యారు. మార్గమధ్యంలో తునిరూరల్ ఎర్రకోనేరు సమీపంలో జన సంచారం లేని ప్రాంతంలోకి కొడుకు బండి మళ్లించాడు. ఎక్కడికిరా ఇటువైపు తీసుకెళుతున్నావ్ అని తల్లి ప్రశ్నించగా స్నేహితులకు డబ్బులు ఇవ్వాలని అందుకు ఇటువైపుగా వెళుతున్నామని బదులిచ్చాడు. అదే మార్గంలో పోలవరం కెనాల్ సమీపానికి తీసుకెళ్లి ద్విచక్ర వాహనం నిలిపివేశాడు. ఇంతలోనే కొడుకు పురమాయించిన ఇద్దరు వ్యక్తులు పెద్ద పుష్పపై దాడికి తెగబడ్డారు. తలకు తీవ్ర గాయమై రోడ్డుపై పడి ఉండటంతో ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని కొడుకు గోపాల్తో పాటుగా దాడికి తెగబడిన ఇద్దరు వ్యక్తులు అక్కడ నుంచి పరారయ్యారు. గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని ముగించుకుని వస్తున్న కొందరు యువకులు పుష్పను చూసి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పుష్పని తుని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. పూర్తి వివరాలు కోసం దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విజయబాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa