సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య పేరిట కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ను మోసం చేసేందుకు ప్రయత్నం చేశారు. వీ హనుమంతరావుకు గురువారం సాయంత్రం సుమారు 7:30 గంటల ప్రాంతంలో హరిరామ జోగయ్య మాట్లాడుతున్నానంటూ 78010 96535 నంబర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. హరిరామ జోగయ్య అనగానే వీహెచ్ స్పందించి ఆయన ఆరోగ్యం, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని చెప్పారు. అయితే మందుల కోసం కనీసం డబ్బులు కూడా లేవని.. ఎంతో కొంత సాయం చేయాలని అవతలి వ్యక్తి వీహెచ్ను కోరాడు.
ఆ తర్వాత వరుసగా ఫోన్లు వస్తూనే ఉండటంతో.. చివరకు ఏ నంబరుకు డబ్బులు పంపించాలని వీహెచ్ అడిగితే 96521 96535 నంబరుకు గూగుల్ పే చేయాలని అవతలి వ్యక్తం చెప్పాడు. వీహెచ్కు ఎందుకో అనుమానం వచ్చింది.. వెంటనే అప్రమత్తమై మాజీ ఎంపీ హర్షకుమార్కు ఫోన్ చేసి రామజోగయ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆయన ఆరోగ్యం అంత బాగ లేదంట అని హర్షకుమార్కు చెప్పగా.. ఎందుకో అనుమానం వచ్చింది. హరిరామజోగయ్య మందులకు కూడా డబ్బులు లేవని ఫోన్ చేశారంటే నమ్మకం కుదరలేదు.
హరిరామజోగయ్యం సినిమాలు తీశారు.. మంత్రిగా పనిచేశారు, కాలేజీలున్నాయి.. అలాంటి వ్యక్తికి డబ్బుల అవసరం ఏంటని హర్షకుమార్ ప్రశ్నించారు. అయినా సరే హర్షకుమార్ వీహెచ్ చెప్పిన దాని ప్రకారం శుక్రవారం ఉదయం రామజోగయ్యకు రూ.5 వేలు పంపించారు. తాను వీహెచ్ను డబ్బులు అడగటం ఏమిటని రామజోగయ్య ఆశ్చర్యపోయారు. గతంలో ఇదే తరహాలో జానారెడ్డి, సుజనా చౌదరీల పేరిట వసూళ్లు చేశారని వీహెచ్ తెలుసుకున్నారు. వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేయగా.. ఆయన ఆరా తీసి ఆ ఫోన్ ఖమ్మం నుంచి వచ్చిందని తేల్చారు. ఆ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని వీహెచ్కు సూచించారు. దీంతో ఆయన హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాంటి తరహా మోసాలు జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa