ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశాల్లోని ఖలీస్థానీల దేశ వ్యతిరేక కార్యకలాపాలు,,,లండన్‌లోని భారత్ కాన్సులేట్ వద్ద నిరసన ప్రదర్శన

national |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 09:37 PM

లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం బయట సోమవారం (అక్టోబరు 2న) నిరసన చేపట్టిన ఖలిస్థాన్ మద్దతుదారులు.. జాతీయ జెండాను అవమానించారు. త్రివర్ణ పతాకాన్ని కిందపడేయడంతో దానిని కొందరు తొక్కుకుంటూ వెళ్లారు. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న ఓ భారతీయ విద్యార్ధి.. జాతీయ జెండాను వెంటనే ఓ వ్యక్తి కాలు కింద నుంచి తీసి దానిని పట్టుకుని వెనక్కి వచ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ విద్యార్ధిపై నెటిజన్లు ప్రశంసలు కురుపిస్తున్నారు.


పుణేకు చెందిన సత్యం సురానా ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. పుణే ఐఎల్ఎస్ లా కాలేజీలో బీఏ ఎల్ఎల్‌బీ పూర్తిచేసిన సత్యం.. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. ఖలీస్థానీ మద్దతుదారులు సోమవారం నాడు లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి, త్రివర్ణ పతాకాన్ని కిందపడేసి తగులబెట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అక్కడకు వెళ్లిన సత్యం సురానా వెంటనే స్పందించాడు. జాతీయ జెండాకు జరుగుతున్న అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. త్రివర్ణ పతకాన్ని అక్కడ నుంచి తీసుకుని వెళ్లాడు. సత్యం మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను నిరసన జరుగుతోన్న ప్రదేశానికి వెళ్లాను.. భారత హైకమిషన్ కార్యాలయం వెలుపల జరుగుతోన్న నిరసన ఖలిస్థాన్ మద్దతుదారులు చేపట్టిందనిని గ్రహించాను.. అయితే జాతీయ జెండా నేలపై పడి ఉంది.. దానిపై నుంచి నడుస్తున్నారు.. ఇది మన జాతీయ పతాకాన్ని అవమానించడమే కాబట్టి నేను దానిని తీసుకుని నిరసన ప్రదేశం నుంచి వెనక్కి వచ్చాను’ అని తెలిపాడు.


‘భారతీయులపై దాడులు చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది... భారత్ అగ్రరాజ్యంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించే దిశగా దూసుకుపోతోంది. ఈ నిరసనలు భారతదేశాన్ని అభివృద్ధి చెందకుండా దృష్టి మరల్చడానికే.. నేను నా దేశ గౌరవాన్ని కాపాడాను.. అయితే బయటికి వెళ్లిన భారతీయులు దేశ వ్యతిరేకులుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి.. భారతదేశాన్ని ద్వేషించేవారు తాము మంచివాళ్లమని నమ్మించేందుకు అజ్ఞానంతో దేశం గురించి చెడుగా మాట్లాడుతున్నారు.. అటువంటి అంశాలపై నిఘా ఉంచాలి.. ఈ అంశాలపై నిఘా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉంది.. భౌతికంగా కాకుండా మేధోపరంగా సమాధానం చెప్పడం ముఖ్యం’ అని ఆయన అన్నారు. మరోవైపు, ఖలీస్థానీ మద్దతుదారులను అడ్డుకోడానికి బ్రిటిష్ భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో మోహరించారు. నిరసనకారులను రాకుండా నిలువరించారు. స్కాట్లాండ్ గ్లాస్‌గో‌లోని గురుద్వారాలోకి భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని ప్రవేశించనీయకుండా ఖలిస్థానీ సానుభూతిపరులు ఇటీవల అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించి.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆ ఘటన తరువాత ఈ నిరసన ప్రదర్శన సాగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa