ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందించినప్పుడు వై నాట్ 175, ప్రజలకు ఇన్ని మంచి పనులు చేసినప్పుడు వై నాట్ 175 అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు నేరుగా అందించామన్నారు. నాలుగేళ్ల పాలనలో వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చాం. గ్రామస్థాయిలోనే సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒకరు ఉండేలా వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చాం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99 శాతం హామీలను నెరవేర్చాం. వైయస్ జగన్ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నాం. వ్యవస్థలోగానీ, పాలనలోగానీ ఇన్ని మార్పులు తెచ్చిన పార్టీ లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa