ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురుంచి ఏమి తెలుసని.. సినీ ప్రముఖులు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు ఏపీ తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత. రోజాకు మద్దతుగా స్పందిస్తున్న సినీ లోకం .. ఆ రోజు పవన్ భార్యను అన్నప్పుడు ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. రోజా చరిత్ర ఏమిటో తెలుసుకుని మాట్లాడితే మంచిదని.. లేక పోతే ప్రజల నుంచి చిత్కారం పొందుతారన్నారు. మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి మాట తప్పారని.. మడమ తిప్పారన్నారు. రాష్ట్రంలో మద్యం ద్వారా సుమారు రూ.94,000 కోట్లు నాలుగేళ్ల కాలంలో పేద వాడి నుంచి దోచుకున్నారన్నారు. జే బ్రాండ్స్లో విషతుల్యాలు ఎక్కువ ఉన్నాయని టీడీపీ నిరూపిస్తే.. తిరిగి తమ పై కేసులు పెట్టారన్నారు. మద్యం బ్రాండ్స్ వలన నాలుగున్నరేళ్ల కాలంలో తాగిన వారి కాలేయం చెడిపోతుందని.. మద్యం వల్ల జనాలు జబ్బుల పాలవుతుంటే జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ఇంటింటికి డాక్టర్ అట అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎంత మందికి సక్రమంగా మందులు అందించగలుగుతున్నారో శ్వేత పత్రం ద్వారా చెప్పగలరా అని ప్రశ్నించారు.
ప్రజల రక్త మాంసాన్ని మద్యం ద్వారా తింటున్నారని, నాసిరకం మద్యం ద్వారా ప్రాణాలు పోతున్నాయన్నారు. మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతే.. ఓట్లు అడుగుతామని అన్నారని.. ఆ దమ్ము జగన్కు ఉందా అని సవాల్ చేశారు. జగన్ మద్యం బ్రాండ్లలో విషతుల్యం ఉందని.. లేబరేటరీలో నివేదికలు అవే చెబుతున్నాయన్నారు. కల్తీ మద్యం తాగి కాలేయం, కిడ్నీ సమస్యలు వస్తున్నాయని, నాలుగేళ్లలో ఎన్నో పుస్తెలు తెగాయన్నారు. తాగుడు ద్వారా వచ్చే డబ్బులతో సంక్షేమం చేస్తున్నామని అంటారా? అని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. చంద్రబాబు హయాంలో హ్యాపీ ఇండెక్స్ ఉంటే.. జగన్ హయాంలో స్ట్రెస్ ఇండెక్స్ ఉందని అనిత విమర్శించారు. ఆడపిల్లపై అఘాత్యాలు పెరిగిపోవడానికి కారణం మద్యమేనని.. గడప గడపకు జగనన్న మద్యం పథకం పెడితే సరిపోతుందన్నారు. కోడి, గుడ్డు మీద ఉన్న శ్రద్ధ.. మద్యపాన నిషేధంపై మంత్రి గుడివాడ అమర్కు లేదన్నారు. మద్యపాన నిషేధం అమలు చేయనప్పుడు.. నవరత్నాలు స్టిక్కర్లో మద్యపానం ఎందుకని అనిత ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa