కాకినాడ జిల్లా సామర్లకోట నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం వర్చువల్గా ప్రారంభిస్తున్న నేపథ్యంలో భీమవరం జిల్లావ్యాప్తంగా జగనన్న లేఅవుట్లలో 40,032 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వాటిలో తణుకు మండలం దువ్వ లేఅవుట్లో తొలి విడతగా అన్ని వసతులు పూర్తయిన 298 గృహాలు గురువారం ప్రారంభించనున్నట్టు భీమవరం కలెక్టరు పి.ప్రశాంతి వెల్లడించారు. జిల్లాలో 92,843 ఇళ్ల్లు మంజూరు కాగా 40,032 ఇళ్లు పూర్తయ్యాయని, 52,811 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa