ఏపీలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది.. సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఓ ఫోటో వైరల్ అవుతుండగా.. ఆ పెద్దాయన గురించే చర్చ జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడుకు చెందిన 80 ఏళ్ల వల్లభని సోమరాజు మొదటి నుంచి టీడీపీ అంటే అభిమానం. ఈ క్రమంలో శనివారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా హోం మంత్రి వనిత ఆ ఊరికి వెళ్లారు. మంత్రి సోమరాజు ఇంటికి వస్తున్నారని తెలిసి ఆయన టీడీపీ కండువా వేసుకుని బయటికి వచ్చారు. పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆ కండువాను తీసేయాలన్నారు. ఆయన మాత్రం తీయనని తెగేసి చెప్పేశారు.
ఇంతలో మంత్రి వనిత సోమరాజు ఇంటికి వచ్చారు. ఈ ప్రభుత్వంలో వచ్చిన పథకాల గురించి వివరిస్తుండగా.. ‘మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. టీడీపీ పుట్టినప్పట్నుంచి పరిచయాలు ఉన్నాయి’ అని మంత్రికి చెప్పారు. మంత్రి వనిత ఎలా ఉన్నారని సోమరాజును పలకరించారు. ఆయన కూడాబాగానే ఉన్నానని చెప్పారు. పింఛన్, రైతు భరోసా వస్తుందా.. అని అడగ్గా వస్తోందని తెలిపారు. ఆ తర్వాత మంత్రి వనిత నవ్వుకుంటూ పక్కింటికి వెళ్లిపోయారు. మంత్రి తండ్రీ ఒకప్పుడు టీడీపీలోనే ఉన్నారని, క్రమశిక్షణ, నాయకత్వం టీడీపీతోనే సాధ్యమవుతుందన్నారు సోమరాజు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ అంటే మొదటి నుంచి తనకు అభిమానం అని చెబుతున్నారు సోమరాజు. హోం మంత్ వచ్చినా సరే మెడలోని కండువాను మాత్రం తీయలేదు. మంత్రి అనుచరులు, స్థానిక నేలు, పోలీసులూ కండువా తీసేయాలని సూచించినా.. ఆ వృద్ధుడు మాత్రం సమస్యే లేదన్నారు. దీంతో ఈ పెద్దాయన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa