కోటీశ్వరుడిని అంటూ మాయ మాటలు చెప్పాడు.. చుట్టు పక్కల జనాలను బాగా నమ్మించాడు. ఆ తర్వాత వచ్చిన పని పూర్తి చేసుకుని చక్కగా చెక్కేశాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఘటన బయటపడింది. అమలాపురంలోని ఎర్ర వంతెన సమీపంలో ఉన్న అపార్టుమెంట్లో మూడు నెలల క్రితం నవీన్చౌదరి అనే యువకుడు అరుణ్ పేరుతో అద్దెకు దిగాడు. తానో వ్యాపారినని అందర్నీ పరిచయం చేసుకున్నాడు. అందరితో నమ్మకంగా ఉంటూ ఉత్సవాలకు, పనిచేసేవారికి సహాయం చేస్తుండడంతో చుట్టుపక్కలవారు నమ్మేశారు. ఇంతలో కార్లను అద్దెకు ఇచ్చే పృథ్వీతో పరిచయం పెంచుకున్నాడు. అతడికి అవసరమైనప్పుడు డబ్బులు కూడా ఇచ్చాడు. అలా పృథ్వీ దగ్గర కారును తాడేపల్లిగూడెంలో అమ్మించి రూ.7 లక్షలు, మరో రియల్టర్ వద్ద రూ.20 లక్షలు.. ఇలా పరిచయమైన వారి నుంచి రూ.లక్షల్లో అప్పులు తీసుకున్నాడుు. ఆ తర్వాత అక్కడి నుంచి పత్తా లేకుండా పోయాడు. తీరా మోసపోయామని తెలిసిన వారు గుట్టుగా ఉన్నారు. అయితే కారు అమ్మేసిన పృథ్వీ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అరుణ్పై గతంలో ఐదు రాష్ట్రాల్లో పదికిపైగా కేసులున్నాయని గుర్తించారు. అతడి తల్లి తమిళియన్ అని.. ఆమె కూడా ఇలాంటి మోసాలకు పాల్పడేదని చెబుతున్నారు. మోసపోయినవారు అరుణ్కు ఫోన్ చేస్తుంటే వెటకారంగా మాట్లాడుతూ.. అందరి రహస్యాలు బయటపెడతానంటూ బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు.మాటలతో బురిడీ కొట్టించి రెండు నెలల్లో అరుణ్ సుమారు రూ.50 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అరుణ్ ఎక్కడున్నాడో గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa