సింహాచలం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. హాయిగా చల్లని ఏసీ బస్సుల్లో వెళ్లొచ్చు. సింహగిరి ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సు నడిపేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ నుంచి అనుమతి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బస్సు కొనుగోలుకు అధికారులు సన్నాహాలు మొదలయ్యాయి. హైదరాబాద్కు చెందిన ఒలెక్ట్రా బస్సుల సంస్థతో రెండు బస్సుల కొనుగోలుకు ఇప్పటికే ఒప్పందం కూడా చేసుకుంది. ఈ క్రమంలో సంస్థ ప్రతినిధులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. 42 సీట్ల సామర్థ్యం కలిగిన డెమో విద్యుత్తు బస్సును సింహాచలం తీసుకువచ్చారు. రూ.1.8 కోట్ల విలువైన ఇలాంటి రెండు బస్సులను దేవస్థానం కొనుగోలు చేయనుండగా.. వీటితోపాటు రూ.18లక్షల విలువైన ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తారు.
డెమో వాహనంతో సింహగిరి ఘాట్ రోడ్డులో ట్రయల్ రన్ నిర్వహించారు. బస్సు పొడవు, వెడల్పు, ఇంజిన్ సామర్థ్యం ఘాట్ రోడ్డులో అనుకూలంగా ఉందో.. లేదో పరిశీలించారు. బస్సు పొడవు, ఎత్తు ఎక్కువగా ఉండటంతో డిజైన్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. శుక్రవారం జరగనున్న దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యుల ఎదుట బస్సును ప్రదర్శించి తదనంతర నిర్ణయాలు తీసుకోనున్నారు. దేవస్థానం ఈవో, ఈఈ, ఏఈలకు ఒలెక్ట్రా సంస్థ సిబ్బంది బస్సు వివరాలు తెలియజేశారు.
ఇప్పటికే ప్రస్తుతం డీజిల్తో నడుస్తున్న బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆలయ కమిటీ చైర్మన్ పూసపాటి అశోక్గజపతిరాజు బస్సుల అంశాన్ని ప్రతిపాదించారు. విద్యుత్తో నడిచే బస్సులను వినియోగించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. కసరత్తు మొత్తం పూర్తికాగానే బస్సుల్ని సింహగిరి ఘాట్ రోడ్డులో నడపనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa