విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త చెప్పారు. అర్చకులకు ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం జగన్ నెరవేర్చారు. 26 జిల్లాలోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625లు అమలు చేస్తూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.14-05-2021న జీవో నంబర్ 52 జారీ చేయగా.. అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ఆంధ్ర ప్రదేశ్ అర్చక సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ సంక్షేమ ఛైర్మన్గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన పేరి కామేశ్వరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జి అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్తో పాటు రాష్ట్రంలోని బ్రాహ్మణుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఇవాళ సీఎం వైఎస్ జగన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పట్టు వస్త్రాలతోపాటు పసుపు, కుంకుమలను ప్రభుత్వం తరపున అందించనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల.. శుక్రవారం కలిసి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa