నేడు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తారు. అమ్మవారి అలంకారాలలో లలితా త్రిపుర సుందరీ దేవికి ప్రత్యేకత ఉంది. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపురసుందరి అని పిలవబడుతోంది. శ్రీదేవి యే శ్రీ చక్ర అధిష్టాన శక్తి గా పంచదశాక్షరీ మహా మంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తుల్ని ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa