ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో వీవీఎస్ లక్ష్మణ్.. ఆలయ అలంకరణకు విరాళం అందజేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 21, 2023, 06:47 PM

మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. తిరుమలలో శ్రీవారి ఆలయం అలంకరణకు విరాళం అందజేశారు. శనివారం (అక్టోబర్ 21) ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వీవీఎస్ లక్ష్మణ్.. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో లక్ష్మణ్, ఆయన కుటుంబసభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల లక్ష్మణ్ చూసిన కొంత మంది భక్తులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం మొదలుకుని శ్రీవారి గర్భాలయం వరకూ టీటీడీ ఉద్యానవనం సిబ్బంది వివిధ రకాల పుష్పాలతో (కట్ ప్లవర్స్) చేసిన అలంకరణను లక్ష్మణ్, ఆయన కుటుంబసభ్యులు ఆసక్తిగా గమనించారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయానికి ఒక్క రోజు అలంకరణకు అయ్యే ఖర్చును వీవీఎస్ లక్ష్మణ్ విరాళంగా అందించారు. 14 లక్షల రూపాయల చెక్కును టీటీడీ అధికారులకు విరాళంగా అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa