ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇద్దరిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తు దశలో ఉండగానే వారిద్దరూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంటూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ సంస్థ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ ఈ పిటిషన్ వేశారు. వృథా చేసిన ప్రజాధనాన్ని వారి నుంచి రాబట్టాలని కోరారు.
సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ సుధాకర్రెడ్డి, సీఎస్, రాష్ట్ర న్యాయశాఖ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, కొన్ని మీడియా సంస్థలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో విచారణ జరిపి ఏఏజీ, సీఐడీ చీఫ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. సివిల్ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వారు వ్యవహరించారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఏపీ, తెలంగాణ, ఢిల్లీలలో విలేకరుల సమావేశాలు నిర్వహించారని పేర్కొన్నారు. చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రజాధనాన్ని వినియోగించి మీడియాతో మాట్లాడారన్నారు.. రాజకీయ నేతలుగా వ్యవహరించారని ఆరోపించారు.
అధికార పార్టీకి ప్రయోజనం కలిగేలా ప్రకటనలు చేశారని పిటిషన్లో ప్రస్తావించారు. ప్రజాసేవకులుగా వారు ప్రభుత్వంనుంచి వేతనం పొందుతున్నారని గుర్తుచేశారు. వివిధ ప్రాంతాలకు తిరిగి మీడియా సమావేశాలు నిర్వహించి దుర్వినియోగం చేసిన ప్రజాధనాన్ని రాబట్టాలని కోరారు. వారిద్దరిపై చర్యలు తీసుకునేలా సీఎస్, న్యాయశాఖ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుతోపాటు ఇతర ఏ కేసుల వివరాలను మీడియా సమావేశాల ద్వారా, ఇతర మార్గాలలో బయటకు వెల్లడించకుండా వారిద్దరినీ నిలువరించాలని కోరారు.
మరోవైపు ఇదే అంశంపై సీఐడీ చీఫ్ సంజయ్తోపాటు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు సత్యనారాయణ. ఈ ఫిర్యాదులపై గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ స్పందించారు. ఈ ఫిర్యాదుపై ప్రభుత్వం తరపున విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని గవర్నర్ అబ్ధుల్ నజీర్ సూచించారు. అయితే గవర్నర్కు అందిన ఫిర్యాదుల్ని సంబంధిత శాఖకు పంపించడం సహాజమేననే వాదన వినిపిస్తోంది. అయితే ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు కావం ఆసక్తికంరగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్డెవలెప్మెంట్ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ తర్వాత సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు వరుసగా ప్రెస్మీట్లు నిర్వహించారు. హైదరాబాద్, ఢిల్లీలో కూడా స్కిల్ కేసుపై ప్రెస్మీట్లో మాట్లాడారు. ప్రజా ధనాన్ని వృథా చేశారని పిటిషన్లో ప్రస్తావించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa