ఆదివారం నాడు ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ..‘‘అమ్మవారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా రెండు విషయాలు కోరుకున్నాను. చంద్రబాబు మీద సీఎం జగన్ దొంగ కేసులను, సంబంధం లేనటువంటి కేసులను బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు. అమ్మవారు దయ చూపి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని, తెలుగు జాతి ముందుండాలని పరితపించిన వ్యక్తిని, త్వరగా విడుదల కావాలని అమ్మవారిని కోరుకున్నాను. అలానే 100 సంవత్సరాల చరిత్రలో భారతదేశంలో ఎప్పుడు ఇటువంటి కరువు పరిస్థితి లేదు. రైతులు వ్యవసాయమంతా కరువుతో బాధపడుతున్నారు. సరైనటువంటి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కరువు బారి నుంచి త్వరగా ప్రజలు భయటపడి కోలుకునే విధంగా శక్తిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నాను అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa