ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబర్ 10నుండి ఉద్యోగుల ఆత్మగౌరవ సభలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 04:59 PM

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీని పక్కకు తోసి వైసీపీ ప్రభుత్వం వెంట నడిచినందుకు ఈరోజు బాధపడుతున్నాం. నాలుగున్నరేళ్లు అయ్యాక సీపీఎస్‌ను సీఎం జగన్  రద్దు చేయలేదు. ఓపీఎస్ అమలు చేయకపోగా జీపీఎస్ పేరుతో మోసపూరిత విధానాన్ని జగన్‌రెడ్డి తెచ్చారు. జీపీఎస్ దేశంలో గొప్పదైన విధానమని అంటారు అని ఏపీసీపీఎస్ ఈఏ అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు అన్నారు. అయితే ఈ బిల్లులో ఏముందో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఎందుకు దొంగచాటుగా బిల్లు పెట్టారు. ముందుగా అందులో ఉన్న అంశాలను ఎందుకు మాకు చెప్పలేదని నిలదీశారు. ఏదో ఓ రోజు మాకు కూడా మంచి రోజులు వస్తాయి... ఆరోజు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.ఉద్యోగులు ఆత్మగౌరవం వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్ల దెబ్బతిన్నది. అందుకే తాము ఆత్మగౌరవ సభలు పెట్టాలనుకుంటున్నాం. డిసెంబర్ 10వ తేదీన అనకాపల్లిలో, డిసెంబర్ 17వ తేదీన ఒంగోలులో మహసభలు నిర్వహిస్తాం. డిసెంబర్ 24వ తేదీన రాజమహేంద్రవరంలో కూడా ఆత్మగౌరవ మహసభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభలకు సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున రావాలని కోరుతున్నాం అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa