టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విజయదశమి పండగ రోజున ''దేశం చేస్తోంది రావణాసుర దహనం - మనం చేద్దాం జగనాసుర దహనం’’ అనే కార్యక్రమానికి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 23వ తేదీన విజయదశమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్యలో వీధుల్లోకి వచ్చి ``సైకో పోవాలి`` అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆ వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని లోకేశ్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa