కడప జిల్లా ప్రొద్దుటూరులో 300 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. నాలుగు రోజులపాటు ఇక్కడ జ్యూయలరీ షాపుల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు.. నాలుగు షాపుల్లో బిల్లులు లేని దాదాపు 300 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. అనంతరం ఆ బంగారాన్ని జాగ్రత్తగా తిరుపతికి తరలించారు. పసిడి వ్యాపారానికి పేరొందిన ప్రొద్దుటూరులో భారీ స్థాయిలో బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేయడం గమనార్హం. ముంబై నగరం తర్వాత ఆ స్థాయిలో ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం సాగుతుంది. ఇక్కడ రెండు వేలకుపైగా బంగారు దుకాణాలు, స్వర్ణకారుల షాపులు ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి అక్రమంగా బంగారం తరలింపు సాగుతోందనే పక్కా సమాచారంతో అధికారులు నాలుగు బంగారు షాపుల్లో సోదాలు నిర్వహించారు.
ఐటీ అధికారుల తనిఖీలతో ఆందోళన చెందిన మిగతా వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. ఐటీ సోదాల నేపథ్యంలో బంగారం వ్యాపారులు దుకాణాలు మూసివేయగా.. పండుగ సమయం కావడంతో కొనుగోలుదారులు ఇబ్బందిపడ్డారు. గతంలో ప్రొద్దుటూరు వాసులు నీలి మందు వ్యాపారం చేశారు. నేపాల్, భూటాన్, శ్రీలంక తదితర దేశాలకు నీలి మందును ఎగుమతి చేశారు. కొంత కాలానికి నీలి మందు వ్యాపారం మందగించడంతో.. బంగారం వైపు వారు ఫోకస్ చేశారు. 100 ఏళ్ల క్రితమే ఇక్కడ 20 మంది బంగారం వ్యాపారాన్ని మొదలుపెట్టారు. వారు నమ్మకంగా వ్యాపారం చేయడంతో.. ఏళ్లు గడిచే కొద్దీ పసిడి వ్యాపారంలో ప్రొద్దుటూరు పేరు మార్మోగింది. ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతం నుంచి బంగారం కొనుగోలు కోసం ఇక్కడికి వస్తుంటారు. ప్రొద్దుటూరులో 12 వేల మందికిపైగా స్వర్ణకారులు పసిడి రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa