పోలీసులు, వారి ఉద్యోగ పదవీ విరమణ గురించి ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 50 ఏళ్లు దాటిన పోలీసులకు సంబంధించి సర్వీస్ హిస్టరీని పరిశీలించనుంది. 50 ఏళ్ల వయసు దాటిన వారి ట్రాక్ రికార్డ్ను పరిశీలించి.. వారికి నిర్బంద పదవీ విరమణ కోసం స్క్రీనింగ్ చేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే శుక్రవారం నోటీసులు జారీ యోగి ప్రభుత్వం చేసింది. ఏడీజీ సంజయ్ సింఘాల్ తరఫున ఐజీ రేంజ్ అధికారులు, ఏడీజీ జోన్లు, మొత్తం ఏడుగురు పోలీస్ కమిషనర్లకు ఈ ఉత్తర్వులు ఇచ్చారు.
దీనికి సంబంధించి 50 ఏళ్లు దాటిన పోలీస్ అధికారుల జాబితాను నవంబర్ 20 వ తేదీ లోపు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 2023 మార్చి 31 వ తేదీ నాటికి 50 ఏళ్లు నిండిన పోలీసుల జాబితాను స్క్రీనింగ్ ప్రక్రియ కోసం పంపించాలని పేర్కొంది. వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఆధారంగా వీరి ఎంపిక జరగనున్నట్లు తెలిపింది. ఈ రిపోర్ట్లో ఆయా పోలీసులు చేసిన పని, వారి సామర్థ్యం, ప్రవర్తన, సర్వీసులో అవినీతికి పాల్పడటం, చెడు ప్రవర్తన ఉన్నట్లు తేలితే వారికి నిర్బంద పదవీ విరమణ ఇవ్వనున్నారు.
ఉత్తర్ప్రదేశ్లో శాంతిభద్రతలను మెరుగుపరిచే లక్ష్యంతో యోగి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే కీలకమైన పోలీస్ శాఖలో కీలక సంస్కరణలు తీసుకురావాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే పోలీసు శాఖలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేని అధికారులు, ఉద్యోగులను తొలగించి.. వారి స్థానంలో సమర్థవంతులైన వారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. సీఎం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే తాజా ఉత్తర్వులు వెలువడ్డాయని.. తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa