ఏపీలో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం ఎండలు మండిపోతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. అక్కడక్కడా తేలికపాటి వానలు కురుస్తున్నాయి. సోమవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూల, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి అంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 45.5 మిల్లీ మీటర్లు, తిరుపతిలో 14.8, సత్యవేడులో 12.4, అన్నమయ్య జిల్లాలో 12, భీమవరంలో 6.2, గూడూరులో 4.6, నెల్లూరు జిల్లా సీతారామపురంలో 4.2 వర్షపాతం నమోదైంది. అంతేకాదు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పగలంతా ఎండ తీవ్రంగా ఉంటోంది. సాయంత్రం కాగానే చలిగాలులు వీస్తున్నాయి.అక్టోబరు నెలాఖరు అయినా సరే పగటి పూట ఎండాకాలాన్ని తలపిస్తోంది. నెల రోజులుగా పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 31-33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అక్టోబరు నెల సాధారణంగా మంచి వర్షపాతం నమోదు కావాలి.. కానీ ఈ ఏడాది ఎండాకాలం తరహాలో ఉదయం నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. జనాలకు ఉక్కపోత తప్పడం లేదు. రాత్రివేళల్లోనూ పలుచోట్ల ఉష్ణోగ్రతలు 21-23 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రాత్రిళ్లు చాలా చోట్ల చలి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa