ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ హైకోర్టు జడ్జిపై పోస్టులు పెట్టిన వారిపై కేసులు.. తీవ్ర చర్యలు ఉంటాయి: ఏపీ సీఐడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2023, 10:38 PM

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిని కించపరుస్తూ సోషల్ మీడియాలో కొంతమంది అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టారని.. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని సీఐడీ చీఫ్ ఎన్‌ సంజయ్‌ ప్రకటన విడుదల చేశారు. కేవలం ఆ ఒక్క న్యాయమూర్తే కాకుండా మొత్తం న్యాయవ్యవస్థనే లక్ష్యంగా చేసుకుని ఇలాంటి అసభ్యకర పోస్టులు పెడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ పోస్టుల వ్యవహారంపై కేసు నమోదు చేశామని.. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరు పరుస్తామని చెప్పారు. న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్రచర్యలు తప్పవని ప్రకటనలో హెచ్చరించారు.


మరోవైపు చంద్రబాబుపై సీఐడీ లిక్కర్ వ్యవహారంలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలతో కేసు ఫైల్ చేశారు. అయితే ఈ కేసులో నవంబరు 28 వరకూ ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని.. అరెస్టు చేయబోమని రాష్ట్రప్రభుత్వం, సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ హైకోర్టుకు హామీ ఇచ్చారు. చికిత్స నిమిత్తం చంద్రబాబుకు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో.. ఆ ఉత్తర్వుల ఉన్నంత వరకు సీఐడీ ఎలాంటి చర్యలు తీసుకోబోదన్నారు.. ఏజీ హామీని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి మల్లికార్జునరావు నమోదు చేశారు. ఇరువైపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణను నవంబరు 21కి వాయిదా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa