వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులందరినీ కలిపి బస్సుయాత్ర తలపెట్టడం గొప్ప ఆలోచన. ఆ వర్గాలకు జరిగిన మంచిని ప్రజలకు తెలియచెప్పడమన్నది ముఖ్యమైన పని. జగన్మోహనరెడ్డి ఆశయ సాధనకు మనమందరం కలిసి పనిచెయ్యాలి. కనిగిరిలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే.. జగన్మోహన్రెడ్డిపై వారికున్న అభిమానం ఎంతో తెలుస్తోంది. కనిగిరి ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందే సమయం అట్టే దూరం లేదు. డిసెంబర్లో ఆ కల నెరువేరుతుంది. ఇది జగనన్న సంకల్పమే అని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa