వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా ఎంపీ బీద మస్తాన్రావు మాట్లాడుతూ...సామాజిక సాధికారత విషయంలో దేశంలోనే ఒక రోల్మోడల్గా నిలిచారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. ఎంతో ఆదర్శవంతంగా పనిచేస్తున్న జగనన్న వల్ల ఈరోజు పార్లమెంటు, రాజ్యసభల్లో వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు. ఎనిమిదిమంది రాజ్యసభ ఎంపీలలో... నలుగురు బీసీకులాలవారే అని గర్వంగా చెప్పగలం. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పార్లమెంటులో మాట్లాడేలా చేసిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. కులగణన చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్మడమే కాకుండా, ఆ దిశలో ముందడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి జగనన్న. స్థానిక సంస్థల్లో బీసీలకు అత్యధికంగా అవకాశం కల్పించింది జగనన్నే. వైయస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మన వర్గాల పిల్లలుపెద్ద చదువులు చదవగలిగారు. ఆరోగ్యశ్రీ పేదలకు వరమయింది. కార్పొరేట్ వైద్యం కూడా పేదలకు అందుబాటులోకి వచ్చింది. ఈ విషయంలో తండ్రికన్నా ఎక్కువగా చెయ్యాలని జగనన్న తపిస్తున్నారు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa