వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ...సభ ఆసాంతం కదలకుండా నిలబడి, ఉపన్యాసాలు విన్న కనిగిరి ప్రజలను చూస్తుంటే..జగనన్నపై ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. సమయం చిక్కినప్పుడల్లా జై జగనన్న అని నినదిస్తున్న ప్రజలను చూస్తుంటే, జగనన్న జనం గుండెల్లో ఉన్న నాయకుడు అని అర్థమవుతోంది. జగనన్నను విమర్శిస్తున్న బాబు, ఆయన పార్టీనాయకులు చెప్పే వన్నీ అబద్దాలే. చేసేవన్నీ మోసాలే. ఈ విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. ప్రజాక్షేమం కోసం ఎన్నో సంక్షేమపథకాలు ప్రవేశపెట్టిన జగనన్న మన నమ్మకం. మనకు మంచి చెయ్యాలని తపిస్తున్న జగనన్న కాపాడుకోవాల్సిన అవసరం మనందరికి ఉంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa