బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. గత ఐదు రోజులుగా వానలు కురుస్తూనే ఉన్నాయి. కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఇవాళ అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు లేదా మబ్బుగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. బుధవారం రోజు కోస్తాలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి.
బాపట్ల జిల్లా అద్దంకిలో 111.2 మిల్లీ మీటర్లు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో 81.6, ప్రకాశం జిల్లా ముండ్లమూరులో 70.2, నెల్లూరు జిల్లా కావలిలో 55.6, కర్నూలు జిల్లా గూడూరులో 43.4, కర్నూలులో 43, పల్నాడు జిల్లా జంగమేశ్వరపురంలో 39.2, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 38.6, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 37.2, కర్నూలు జిల్లా ఆస్పరిలో 34.6, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 33, కృష్ణా జిల్లా అవనిగడ్డలో 31.2, బాపట్ల జిల్లా రేపల్లెలో 30.4, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 30.4 మిల్లీ మీటర్ల వర్షపాత నమోదైంది.
ఈ వర్షాలతో రైతులకు కొంతమేర రిలీఫ్ దక్కింది. పంటలు ఎండిపోతున్న సమయంలో వానలతో మేలు జరుగుతుందన్నారు. అంతేకాదు గతవారం వరకు ఎండలు మండిపోవడంతో జనాలుర ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉక్కపోతతో అల్లాడిపోయారు. అయితే ఈ వర్షాలతో వాతావరణం చల్లబడింది. అలాగే కొన్ని జిల్లాల్లో రాత్రిళ్లు చలి వాతావరణం ఉంటోంది. మొత్తానికి ఈ వానలు ఏపీకి ఉపశమనమనే చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa