ఏపీలో మరో ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభమైంది. ‘వై ఏపీ నీడ్స్ జగన్’కు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. ప్రతి మండలంలో రోజుకొక సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో కూడా రోజూ ఈ కార్యక్రమం జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఈవో, పట్టణ ప్రాంతాల్లో అదనపు కమిషనర్ నోడల్ అధికారులుగా ఉంటారు.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 19 వరకూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, చర్చా వేదికలు నిర్వహించనున్నారు. ప్రభుత్వంలో జరిగిన మేలుపై 'ప్రజాతీర్పు' సర్వేతో కార్యక్రమాలు చేపడతారు. సచివాలయాల వద్ద రియల్ డెవలప్మెంట్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తారు. మేనిఫెస్టోలోని అంశాల్లో దాదాపు 99.5 శాతం పూర్తి చేశామని వివరిస్తారు.
ప్రభుత్వం నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఎలాంటి మేలు జరిగిందో ఈ కార్యక్రమంలో వివరిస్తారు. డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో ప్రభుత్వం ఏఏ పథకాలు అమలు చేస్తోందో ప్రజలకు తెలియజేయనున్నారు. ఒకవేళ అర్హత ఉండి ఎవరికైనా పథకాలు అందకపోతే వారికి అందే ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో వివరిస్తారు. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో జరిగిన మంచి ఏంటో ప్రతి ఇంటికీ వివరిస్తారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో కూడా ప్రజలకు వివరిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa