లండన్ మేయర్ ఎన్నికల బరిలో ఉన్న భారత సంతతికి చెందిన అభ్యర్థి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు కోరారు. లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణ్ గులాటీ జనసేనానిని కలిశారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఎక్కువగా ఉన్నారని గులాటీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ అభ్యర్థనను పవన్ కళ్యాణ్ స్వాగతించినట్లు.. ఆయనను అభినందించినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తన అభిమానులు, జనసేన శ్రేణులు, తెలుగువారు, భారతీయులు తరుణ్ గులాటీ విజయానికి కృషి చేయాలని పవన్ కోరినట్లు ఈ ప్రకటనలో తెలిపారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కార్యకర్తలను తనవాళ్లగా భావిస్తారని.. వారికి అండగా నిలవాలని తపిస్తారన్నారు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. క్రియాశీలక సభ్యుల కోసం తీసుకువచ్చిన రూ.5 లక్షల ప్రమాద బీమా బాధలో ఉన్నవారికి ఒక ఓదార్పు అన్నారు. గుంటూరు జిల్లాకి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు చల్లగిరి రామకృష్ణు, సిద్ధంశెట్టి గోపీకృష్ణల కుటుంబాలను మనోహర్ పరామర్శించారు.
ఇటీవల జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో వారిద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన క్రియాశీలక సభ్యులకు నివాళులు అర్పించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. గురజాల నియోజకవర్గం శ్రీనగర్ గ్రామానికి చెందిన రామకృష్ణ భార్య సామ్రాజ్యం, పెదకూరపాడు నియోజకవర్గం కాశీపాడుకి చెందిన గోపీకృష్ణ తల్లి శ్రీదేవిలకు రూ. 5 లక్షల బీమా చెక్కులు అందచేశారు. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa