ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్.. హైకోర్టు సీరియస్, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2023, 05:22 PM

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణను సీబీఐకు అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ‌పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం గతంలో ఆదేశాలు జారీ. ప్రతివాదులందరికి నోటీసులు ఇవ్వడం కుదరలేదని.. పిటిషనర్ ఉండవల్లి తరఫు లాయర్లు కోర్టు ముందు ప్రస్తావించారు. ఈ నోటీసులు అందరికీ అందలేదన్నారు. నోటీసులను అందరికీ అందకపోవడంతో కేసు విచారణను హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. అలాగే ఆలస్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి సూచించారు.


స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసు రెండు మూడు రాష్ట్రాలకు విస్తరించి ఉండటంతో కేసును సీబీఐకి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్థిక పరమైన నేరం, జీఎస్టీ ఎగవేత ఉండటం, ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేస్తుందని, అందువలనే సీబీఐ విచారణకు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసినట్లు ఉండవల్లి చెప్పారు.


ఈ పిటిషన్‌లో సీబీఐ డైరెక్టర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్‌, డిజైన్‌టెక్‌ సంస్థ, ఆ సంస్థ ఎండీ వికాస్‌ ఖన్వేల్కర్‌, స్కిల్లర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44మందిని తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa