నాలుగున్నరేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రగతిపథంలో నిలపడాన్నివైసీపీ నేతలంతా వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు వివరించారు. ఆయా గ్రామాలకు చేసిన మంచిని గణాంకాలతో సహా కళ్లకు కట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్ అమలు చేసి మాట నిలబెట్టుకోగా 2014లో చంద్రబాబు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా నిలువుగా మోసగించిన తీరును వివరించారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో నాడు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చంద్రబాబు మేనిఫెస్టోను మాయం చేయడాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు పూచీ తనదంటూ 2014లో నమ్మబలికిన పవన్ కళ్యాణ్ అనంతరం దగా చేసిన తీరును ఎండగట్టారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు–పవన్లు ఉమ్మడి మేనిఫెస్టోతో వస్తున్నారని, వారికి తగినరీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సుపరిపాలన కొనసాగాలంటే సీఎం జగన్ను ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa