సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా రాష్ట్రరెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, నాలుగున్నరేళ్ల వైయస్సార్ సీపీ ప్రభుత్వ పాలనను మహిళలు అపురూపంగా ఆదరించడం వెనుక జగన్ ఆలోచనా విధానం ఉందని వివరించారు. దేశంలో సీనియర్ పొలిటిషీయన్ గా చెప్పుకునే చంద్రబాబు చాలా ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేసి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతూ వంచనకు గురి చేస్తున్న అంశాన్ని ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 32 లక్షల మందికి 12,800 కోట్లరూపాయలతో భూమి కొనుగోలు చేసి సొంతింటి కలను వైయస్ జగన్ నెరవేరుస్తున్నారని, గతంలో పాలకులు ఎవరైనా సరే ప్రజలకు సొంత గూడు కల్పించాలన్న ఆలోచన చేసారా అని ధర్మాన ప్రశ్నించారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తేనే విద్యా, ఆరోగ్యం, సంక్షేమం, పేదలకు సొంతిల్లు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హయాంలో ఈ పనులు ఎప్పుడైనా చేసారా అన్న ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్రంలో భోగాపురం ఎయిర్ పోర్టు, పోర్టులు, విద్యుత్ ప్రజెక్టులతో పాటు అనేక పరిశ్రమలు నెలకొల్పుతుండటం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. వైయస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే అత్యుత్తమమైనవని వివరించారు. అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన జగన్ గెలిపిస్తారా.. ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న వాటినే మళ్లీ ఓసారి అధికారంలోకి వస్తే చేస్తానని చెబుతున్న చంద్రబాబును నమ్ముతారా అని ధర్మాన ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు మొట్టమొదటిసారిగా అధికారం ఇచ్చి జగన్ సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa