సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ...... ప్రతీ పౌరునికి సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న దేశంలోని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని గుర్తు చేసారు. కరోనా వంటి విపత్కర సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు విలవిలలాడగా, సీెఎం జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రజలకు జగన్ ఆరోగ్యసేవలు, సంక్షేమం అందించారన్నారు. ఈరోజు ప్రజలంతా క్షేమంగా ఉన్నారంటే ఆరోజు జగన్ ప్రజల పట్ల చూపిన సంరక్షణ, సంక్షేమమే కారణమని వివరించారు. సామాజిక సాధికారత అంటే ఏంటో తన పాలనలో చేతల్లో చూపిన సీఎం వైయస్ జగన్ అని సత్యవతి వ్యాఖ్యానించారు.వచ్చే ఎన్నికల్లో వై ఏపీ నీడ్స్ జగన్, వై నాట్ 175 అన్న ముఖ్యమంత్రి లక్ష్యాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa