వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విదంగా విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. గడిచిన నలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా 4.65 లక్షల కోట్ల రూపాయలు అందించారని తెలిపారు. గత టీడీపీ పాలనలో అయితే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న వారికే పథకాలు అందేవని కానీ తమ పాలనలో కులం, మతం, పార్టీ లు చూడకుండా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఎల్లో మీడియా నిత్యం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. జగన్ చేసిన అభివృద్ధిని దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఒకవైపు ప్రతిపక్షాలు మరోవైపు ఎల్లో మీడియా ఎన్ని దుష్ప్రచారాలు చేసిన తాము మాత్రం పాజిటివ్ ఏజెండా తోనే ఎన్నికలకు వెళతామని చెప్పారు. అందుకే ఏపీ జగనన్న ఎంత అవసరమో తెలియ చెప్పేందుకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగదీష్, వజ్రకరూరు సర్పంచ్ మొనలిసా, ఎంపీపీ రమావత్ దేవి, ఎంపీడీఓ విజయలలిత, తహశీల్దార్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, ఎంపీటీసీ పెన్నహోబిలం, పార్టీ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ నారాయనప్ప, సుదీర్ రెడ్డి, వైద్యనాథ్ రెడ్డి, ఉస్మాన్,సామా నాయక్, మహనంద రెడ్డి, శ్రీనివాసులు మారెన్న, మోహన్, నాగరాజు,రామచంద్ర, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa