వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ....... పాదయాత్రలో జగన్ పేదల కష్టాలను గమనించి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారన్నారు. కేవలం ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా పాలన చేయడం జగన్ అభిమతమని గుర్తు చేసారు. వైయస్సార్ సిపి ప్రభుత్వ పాలనలో మా జీవన ప్రమాణాలు పెరిగాయని ప్రజలు చెబుతున్నారంటే ఎంతటి సంక్షేమ పాలన జగన్ అందిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. సంక్షేమ సారథిగా పాలన సాగిస్తున్న సీఎం జగన్ కు ప్రజలు అండగా ఉండాలని పులుపునిచ్చారు. పార్వతీపురం నియోజకవర్గంలో రూ. 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జగన్ హయాంలో చేపట్టామని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa