అనంతపురం జిల్లా, మడకశిర నియోజకవర్గంలోని ఒక వలంటీర్ ఆవేదనపై స్పందించిన నారా లోకేశపై విమర్శలు చేయడం ఎంతవరకు న్యాయం అని టీడీపీ సీనియర్ నాయకులు మల్లికార్జున అన్నారు. అలాగే నిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వ అనుమతులతో న్యాయంగా వ్యాపారం చేస్తున్న గుండుమల తిప్పేస్వామిని ఎమ్మెల్యే విమర్శించడం శోచనీయమని మండిపడ్డారు. అనేక అక్రమాలకు పాల్ప డుతున్న మీరు గుండుమలను విమర్శిస్తారా అంటూ ప్రశ్నించారు. దళితులు రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం లేకుండా వైసీపీ పాలనలో తొక్కి పెడుతున్నారని విమర్శించారు. మీప్రభుత్వ విధానాలు నచ్చక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుంచి బయటకు రావడమే అందుకు ఉదాహరణ అన్నారు. ఎస్సీ డ్రైవర్ను హతమార్చిన ఎమ్మెల్సీ అనంతబాబుపై ప్రభుత్వం ఎందుకు ప్రేమ చూపుతోందని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు సైతం టీడీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని, స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa