అనకాపల్లి జిల్లాలో ప్రజల్ని పోలీసులు హెచ్చరించారు. అలాగే పోలీస్ సిబ్బందికి, అధికారులను అలర్ట్ చేశారు. ఈ మధ్య చెడ్డి గ్యాంగ్ పేరుతో ఒక ముఠా నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ చెడ్డి గ్యాంగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేరాలు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. కొద్దిరోజుల క్రితం తిరుపతిలో కూడా ఈ ముఠా యొక్క కదలికలు సీసీ ఫుటేజ్లో కనిపించిందన్నారు. కావున అనకాపల్లి జిల్లాలో కూడా ఈ ముఠా నేరాలు పాల్పడే అవకాశం ఉంది అన్నారు. ముఖ్యంగా రాత్రి పూట ఇళ్లకు వేసే తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారన్నారు. కాబట్టి ఈ చెడ్డి గ్యాంగ్ ముఠా విషయంలోఅనకాపల్లి జిల్లా పోలీసులు ,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఈ చెడ్డి గ్యాంగ్ పట్ల అవగాహన కలుగజేసి ఎటువంటి నేరాలు మన జిల్లాలో జరగకుండా చూడవలసిందిగా కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.
తిరుపతి జిల్లాలో కూడా చెడ్డీ గ్యాంగ్ కదలికలు కలకలంరేపాయి. నాలుగు రోజుల వ్యవధిలో మూడు చోరీలకు విఫలయత్నం చేసింది. రేణిగుంట రోడ్డులో కృష్ణతేజ కాలేజి, భార్గవ్ ఆటోమోబైల్ షోరూం, చెర్లోపల్లి వద్ద ఒక డాక్టర్ నివాసంలో చోరీకి ప్రయత్నించింది. సీసీ కెమెరాలో కదలికలు రికార్డ్ అయ్యాయి. నడుముకు రాళ్లు, ఆయుధాలు ధరించిన ముగ్గురు కనిపించారు. ఇప్పటికే వారి పోటోలు, వీడియో విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతి నగర శివార్లలో పోలీసు పెట్రోలింగ్ను పెంచారు. సరిహద్దు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని సైతం తిరుపతి పోలీసులు అప్రమత్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa