పులివెందుల వెళ్లాల్సి వచ్చినా ఏపీ సీఎం జగన్ గజగజా వణుకుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత ఇన్ని చేసినా ఓట్లేసిన జనాన్ని చూడాలంటే జగన్ రెడ్డికి భయమని తెలిపారు. సొంత నియోజకవర్గ ప్రజల్ని ఎదుర్కోలేని పిరికి పంద జగన్ అని నారా లోకేష్ పేర్కొన్నారు. తన ఎన్నికల ప్రత్యర్థి, టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవిని చూసినా భయపడుతున్నాడన్నారు. రాజకీయ కక్ష సాధింపునకు పోలీసుల్ని పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నాడని పేర్కొన్నారు. రవి అక్రమ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆయనకి ఏం జరిగినా జగన్, పోలీసులదే బాధ్యత అని నారా లోకేష్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa